సిరాన్యూస్, ఉట్నూర్
బీజేపీ పార్టీ గెలుపు లక్ష్యంగా పని చేయాలి
* ఎంపీ స్థానాన్ని మోడీకి బహుమతిగా ఇవ్వాలి
* ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి గేడం నాగేష్మా, జీ ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మనమందరం పని చేయాలని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పనిచేసిన అనుభవం గేడం నగేష్ కి ఉందన్నారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఉట్నూరు మండల నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.