చర్చనీయాంశం అయిన పోలీసు అధికారుల అరెస్టు

 సిరా న్యూస్,హైదరాబాద్;
టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, టాస్క్్క్ఫర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అయితే వారి బారిన పడి ఇప్పటికే జైలుపాలైన, వారితో వేధింపులకు గురైన కొందరు అమాయకులు వారికి తగిన శాస్త్రి జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారు కూడా నిందితులుగా జైలుకు వస్తున్నారనే సమాచారం తెలియడంతోసంతోషిస్తున్నారని తెలుస్తోంది. వారి బారిన పడి అరెస్టు అయిన చాలా మంది బాధితులు చంచల్గూడ జైలులో ఉండడంతో ఇద్దరు అధికారులు ర్యాంగింగ్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గంజాయి,హవాలా, చోరీ కేసులలో అరెస్టు వారి నుంచి టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లుకు తీవ్ర స్థాయిలో ర్యాగింగ్ ఉంటుందనే టాక్ చంచల్గూడ జైలులో వనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *