గంగాధరలో తెలుగు దేశం పార్టీ 42 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 సిరా న్యూస్,చొప్పదండి;
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో తెలుగు దేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్కాపురం రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ జెండానుఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశం గౌడ్ మాట్లాడుతూ బలమైన రాజకీయ నాయకులను తయారుచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎన్టీ రామారావు తెలుగు కీర్తికి మారుపేరు గొప్ప మహనీయుడు అని కొనియాడారు. అదేవిధంగా స్వర్గీయులు ఎన్టీఆర్ కు ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపునడిమాండ్ చేస్తున్నామని తెలిపారు. గట్టుభుత్కూర్ గ్రామంలో గత నెల బోయిని లచ్చయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగిందని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి కుటుంబానికి 2016 రూపాయలు ఆర్థిక సహాయంఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మల్కాపురం రాజేశం గౌడ్,జిల్లా నాయకుడు వైద భూపతి, కార్యకర్తలు అలిపిరెడ్డి జనార్ధన్,ముదిగంటి బాలు ఖాన్, పెళ్లిహనుమంతు, పొత్తూరి లచ్చయ్య, గుండ కనకయ్య, సాయిల కుంటయ్య, గొల్లబత్తిని సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *