సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ను ప్రాంతీయ పద్మశాలి సంఘం ప్రతినిధులు గురువారం రాత్రి ఆయన కార్యాలయంలో కలిశారు. తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తామంతా గత 30 సంవత్సరాలుగా కొట్టు సత్యనారాయణ నాయకత్వాన్ని, పాలన తీరును ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. ఆయన హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అలాగే ముఖ్యంగా కొట్టు నాయకత్వంలోనే శాంతిభద్రతలు పరిరక్షించబడి ప్రశాంతమైన వాతావరణం లో అందరూ సంతోషంగా జీవించగలిగే పరిస్థితులు ఉంటాయన్నారు. అభివృద్ధి, శాంతిభద్రతలు, సమర్థవంతమైన నాయకత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కొట్టుకు తామంతా అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు వివిధ సందర్భాల్లో కొట్టు సత్యనారాయణ చేసిన సహకారంతో వారికి కలిగిన ప్రయోజనాలను వివరించారు. మంత్రి కొట్టును కలిసి మద్దతు తెలిపిన వారిలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు ఉయ్యూరి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ శీరపు అప్పారావు, దీకొండ వెంకటేశ్వరరావు, సోర్ణపూడి ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, ఇమ్మంది కృష్ణ, పి రామకృష్ణ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కొలుకులూరి ధర్మరాజులు పాల్గొన్నారు.
======================