Muzaffar Ali Khan: ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి

సిరాన్యూస్‌, జన్నారం టౌన్
ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి
* గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి
* కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్
* మండ‌ల‌ ముఖ్య కార్యకర్తల సమావేశం

ఆత్రం సుగుణ‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్ అన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆదివాసి ముద్దుబిడ్డ, జన్నారం మండల ఆడబిడ్డ ఆత్రం సుగుణ కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించిన సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండ‌ల‌ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ కి అత్యధిక మెజారిటీ సాధించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఖానాపూర్ నియోజకవర్గాన్ని, జన్నారం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నాయకత్వంలో మండలంలో భారీ మెజారిటీ సాధిస్తామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముజాఫర్ అలీ ఖాన్, మేకల మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిక్కిలినేని రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, బాదావత్ సుధాకర్ నాయక్, యాదగిరి కమలాకర్ రావు, కంటెం శంకర్, దుర్గం లక్ష్మీనారాయణ, సయ్యద్ ఇబ్రహీం, టేకుమట్ల పంకజ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *