Jogu Ramanna: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు
* మైనార్టీ సంక్షేమానికి బీఆర్ఎస్ ఎంతో కృషి
* మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్ర‌వారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి జోగు రామన్న, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు పండ్లు తినిపించుకున్నారు. ఈసంద‌ర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తోఫాను కూడా అందజేసింద‌న్నారు. ఆర్థికంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో రంజాన్ పండుగ జరుపుకునేలా ప్రోత్సహించిందన్నారు. మైనార్టీ సంక్షేమానికి బిఆర్ ఎస్ పార్టీ చేసిన కృషి ఎంతో ఉందని తెలిపారు. మైనార్టీలు విద్యపరంగా ఉన్నత స్థానంలో ఉండేలా మైనార్టీ గురుకులాలను సైతం ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ అన్నారు. కార్య‌క్ర‌మంలో సాజితోద్దీన్, యూనిస్ అక్బాని, ఆశ్రాఫ్, సలీం,ఏజాజ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *