10th class: ప్ర‌శాంతంగా ముగిసిన పది పరీక్షలు

సిరాన్యూస్‌, చిగురుమామిడి
* ప్ర‌శాంతంగా ముగిసిన పది పరీక్షలు

ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు చిగురుమామిడి వ్యాప్తంగా శ‌నివారం ప్రశాంతంగా ముగిశాయి. చిగురుమామిడి సెంటర్ లో 222 మంది,ఇందూర్తి 55 మంది మొత్తం 277 విద్యార్థులు పరీక్షలు రాశారు. 100శాతం విద్యార్థులు హాజరయ్యారు. 12 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 విధించి ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు మంచి నీళ్ళు,వైద్య సదుపాయాలు కల్పించారు. పరీక్ష లు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.పరీక్షలు మొత్తం పూర్తయినప్పటికీ ఏప్రిల్ 1న 96 మంది ముల్కనూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఓకేషనల్ కోర్స్ ఐటీ పరీక్ష రాస్తారని తెలిపారు.విద్యార్థులు తప్పకుండా పాస్ అవుతామనే ధీమా తో విజ‌యం సింబల్ చూపిస్తూ…ఆనందంతో తమ ఇళ్లకు చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *