సిరాన్యూస్, ఆదిలాబాద్
విద్యార్థిని చికిత్స కోసం పాయల్ శరత్ రూ.25వేలు సాయం
నిరుపేద కుటుంబానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ చేయూతనదించింది. ఆదిలాబాద్ జిల్లా తంతొలి గ్రామానికి చెందిన పల్లికొండ సంతోష్ కూతురు పల్లికొండ వైష్ణవికి 9సంవత్సరాల క్రింద ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడంతో 54శాతం గుండె కుట్టుకుంటుంది. ఆపరేషన్ చేస్తే నే వైష్ణవి కోలుకునే అవకాశం ఉందని, చికిత్స నిమిత్తం 3నుండి 5లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న నిరుపేద కుటుంబానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ చైర్మన్ పాయల్ శరత్ రూ. 25000 ఆర్థిక సహాయం అందజేశారు.