Vidyasagar: ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి

సిరాన్యూస్‌, సైదాపూర్
ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి
* ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షులు కొంకట విద్యాసాగర్

ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షులు కొంకట విద్యా సాగర్ అన్నారు. శ‌నివారం హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలో ఎన్ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ప్రతీ ఒక్క ఎన్ఎస్‌యూఐ కార్యకర్త కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎన్ఎస్‌యూఐ మండల అధ్యక్షులు కొంకట విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు రాయిశెట్టి పవన్, రోషన్ , మద్ది పవన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *