chori: ఫుడ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తుల చోరీ

సిరాన్యూస్‌, సైదాపూర్
ఫుడ్ కోర్టులో గుర్తుతెలియని వ్యక్తుల చోరీ

సైదాపూర్ మండలం సోమారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న ఫుడ్ కోర్టులో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సోమారం గ్రామానికి చెందిన కాశపాక వెంకటేశం అనే వ్యక్తి ఫుడ్ కోర్టు పెట్టుకుని బజ్జీలు, పల్లీలు, శనగలు, తదితర తినుబండారాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఫుడ్ కోర్టు షెటర్ తాళం పగలగొట్టి రూ.1500 నగదు, తినుబండారాలు తదితర వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడు నిందితులను పట్టుకుని శిక్షించి, త‌న‌ను అదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *