పాడేరులో టిడిపి కార్యకర్తలు ఆందోళన

టిడిపి నాయకులు పాడేరు టిడిపి అభ్యర్థిపై పునరాలోచించాలి
సిరా న్యూస్,పాడేరు;
పాడేరు లో టీడీపీ కార్యకర్తలు అందోళనకు దిగారు. పార్టీలో కష్టపడిన వారికి కాకుండా ఎటువంటి టిడిపి కార్యక్రమాలలో పాల్గొనని వారికి టికెట్ కేటాయించడం అన్యాయమని అన్నారు.. డబ్బులకు అమ్ముడుపోయిన టీడీపీ నేతలకు బుద్ధి చెబుతాం. పాడేరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కిల్లు వెంకటరమేష్ నాయుడును ఓడిస్తాం. గిడ్డి ఈశ్వరిని పాడేరు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించుకుంటామని టీడీపీ శ్రేణులు హెచ్చరిక. పాడేరులో పలు మండలాల నేతలు ఇదేమి ఖర్మ పత్రులను దగ్ధం చేసి పార్టీ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. టిడిపి పార్టీ శ్రేణులకు తెలియని వ్యక్తికి టికెట్ ఏవిధంగా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *