ఏప్రిల్ 3 నుండి ధ్వజస్తంభ పున ప్రతిష్టాపన కార్యక్రమం

సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం కలవచర్ల గ్రామంలో గల శ్రీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ధ్వజస్తంభ పున ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించబడతారని నిర్వాహక కమిటీ తెలిపారు. అలాగే పున ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ వారు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని 700 సంవత్సరాల పురాతనమైన శ్రీ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయ ధ్వజస్తంభ పున ప్రతిష్ట కార్యక్రమం ఏప్రిల్ 3,4,5 తేదీలలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ధ్వజ స్తంభ నిర్మాణ పనులు మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి , ఎంపీటీసీ కొట్టే సందీప్ మరియు ఆలయ కమిటీ చైర్మన్ కొలిపాక సత్తయ్య ఆధ్వర్యంలో ధ్వజస్తంభ పున: ప్రతిష్ట కు సంబంధించిన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున ఏప్రిల్ 3, 4, 5 తేదీలలో జరిగే కార్యక్రమానికి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *