తహసిల్దార్ ఆరిపోద్దిన్.
సిరా న్యూస్,కమాన్ పూర్;
కుల వివక్ష చూపితే కఠిన చర్యలు తప్పవని కమాన్ పూర్ తహసిల్దార్ ఆరిపోద్ది న్ అన్నారు. కమాన్ పూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ గ్రామాల్లో కలిసికట్టుగా ఉండాలని కుల వివక్ష చూపకూడదు అని అన్నారు. దేవాలయాల్లో వివక్ష చూపకూడదని ప్రతి ఒక్కరికి దేవాలయంలో వచ్చేలా చూడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమాన్ పూర్ తహసిల్దార్ ఎండి ఆరీపుద్ధీన్, కమాన్ పూర్ ఎస్.ఐ -2 జక్కు రవళి, ఏఎస్ఐ బాలాజీ నాయక్ , హాస్టల్ వార్డెన్ వెంకట స్వామి ,మానవ వికాస వేదిక రాష్ట్ర కళామండలి అధ్యక్షులు దాసరి రామస్వామి , పొనగంటి రవి , ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు అంబటి కనకయ్య , లింగాల గ్రామం స్త్రీలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.