Current Shock: కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

సిరా న్యూస్, ఆదిలాబాద్:

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి చెందిన కాట్పెల్లి వామన్ రెడ్డి కి చెందిన ఎద్దు మేతమేస్తూ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. స్థానికులు బాధితుల కథనం మేరకు… వామన్ రెడ్డి ఎడ్లు సాంగ్వి శివారంలోని పూండ్రు ప్రవీణ్ చేన్లో మేతమేస్తున్నాయి. చేను గట్టు మీద మేతమేస్తుండగా ఒక ఎద్దు ట్రాన్స్ఫార్మర్ కు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రైతు సంఘటన స్థలానికి చేరుకొని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. సుమారు రూ. 50 వేల విలువ చేసే ఎద్దు మృతి చెందడంతో లబోదిబోమన్నాడు. అధికారులు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *