టైగర్ జోన్లను నిలిపివేయాలి

మావోయిస్టుల హెచ్చరిక
సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ పేరిట లేఖలు విడుదల చేసారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కన్నాయిగూడెం వద్ద మావోయిస్టు కరపత్రాలు వెలసాయి. ఆదివాసీలను విస్తాపన చేసే కార్పొరేట్ కంపెనీలు అయినా మైనింగ్స్, ప్లాంట్లు ,రోడ్లు డ్యాములు టైగర్ జోన్లు నిలిపివేయాలని కార్పొరేట్ సెక్యూరిటీ పోలీస్ క్యాంపులను ఉద్యమాలను అణిచివేసే పార మిలటరీ బలగాలను, స్పెషల్ బలగాలను కూడా నిలిపి వేయాలని రోడ్ల పై మావోయిస్టుల కరపత్రాలు కనబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఈ కరపత్రాలు వెలవడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
=========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *