Sangidi Shivalayam: ఎప్రిల్‌ 1న శివాలయ నిర్మాణానికి భూమి పూజ

సిరా న్యూస్, బేల:

ఎప్రిల్‌ 1న శివాలయ నిర్మాణానికి భూమి పూజ

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో పెన్‌గంగ నదీ తీరంలో గ్రామస్తులు, గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగుల సహాకారంతో నిర్మించనున్న శివాలయ నిర్మాణానకి ఎప్రిల్‌ 1న సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం 9:15 గంటలకు వేద పండితుల ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో పాటు వివిద పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. ఉదయం 6గంటల నుంచే పాత సాంగిడిలోని సంత్‌ మోతీజి మహారాజ్‌ మందిర్‌ మీదుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు భాజా భజంత్రీలు, మంగళ హారతుల నడుమ పెద్ద ఎత్తున శోభా యాత్ర నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై శివుని కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *