సిరాన్యూస్, సైదాపూర్
గురుకుల పాఠశాలల నూతన భవనాల నిర్మాణం ఎప్పుడు?
* గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అద్దె భవనాల్లోనే గురుకులాలు…
* నూతన భవనాలు వెంటనే నిర్మించాలి
* ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్
గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు వెంటనే నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ అన్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సైదాపూర్ మండల మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను హుజురాబాద్ మండల కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న దాన్ని వెంటనే మంత్రి స్పందించి గురుకుల పాఠశాలను సైదాపూర్ లోనే నూతన భవనం నిర్మించాలని కోరారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కోనసాగుతన్నాయని, నూతన భవనాలు నిర్మించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోలేదని ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా సైదాపూర్ గురుకుల పాఠశాల హుజురాబాద్ మండలం లో రైస్ మీల్లుల దగ్గర అద్దె భవనాల్లో నడుపుతున్నారని మీల్లుల ద్వారా వచ్చే పోగ వల్ల విద్యార్థులకు చర్మ సమస్యలు, శ్వాశకోశ సమస్యలు వస్తాయని తెలిపారు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని, వెంటనే మంత్రి స్పందించి సైదాపూర్ లోనే గురుకుల పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని కోరారు.