బద్వేల్ అసెంబ్లీ లో పొలిటికల్ హీట్

నువ్వా నేనా అనే విధంగా కూటమి అభ్యర్థి రోశయ్య వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా

ఇంకా ప్రకటించని కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరింత హిట్

సిరా న్యూస్,బద్వేలు;

బద్వేలు అసెంబ్లీలో పొలిటికల్ హీట్ పెరిగింది నువ్వా నేనా అనే విధంగా కూటమి అభ్యర్థి బొజ్జ రోశయ్య వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా పోటీ పడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది స్పష్టం కావడం లేదు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పార్టీ అధికార ప్రతినిధి విజయ జ్యోతి పోటీ పడుతున్నారు. ఇతర పార్టీల తరఫున పలువురు ఎమ్మెల్యే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాన పోటీ మాత్రం కూటమి అభ్యర్థి వైకాపా అభ్యర్థి మధ్య ఉంటుంది. ప్రధాన విషయం ఏమంటే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో లేకుండా పోయింది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ బాగా ప్రచారం చేసింది. కానీ పొత్తుల్లో భాగంగా బద్వేల్ అసెంబ్లీ బిజెపికి కేటాయించడంతో తప్పని సరి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొజ్జ రోశయ్య బిజెపిలో చేరారు. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన రెండు రోజులకే ఆయనను పార్టీ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. దీంతో బొజ్జ రోశయ్యకు తెలుగుదేశం జనసేన బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. గత ఆరు నెలలుగా బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె కుమారుడు పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేగాక యువ నేత తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఏడు మండలాల్లో 310 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్రకు ప్రజల నుండి ఊహించని విధంగా స్పందన వచ్చింది అప్పట్లో టిడిపి ఇన్చార్జిగా బొజ్జ రోశయ్య ఉన్నారు. ఆయన కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే పాదయాత్రకు స్పందించిన ఎంతోమంది రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ నాయకులతో చేతులు కలిపారు. పలు మండలాల్లో వైసీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు వందల సంఖ్యలో ఆ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీ లో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మాజీ మండల అధ్యక్షులు ప్రస్తుత మండల అధ్యక్షులు మాజీ జెడ్పిటిసిలు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచులు ఉన్నారు. తెలుగుదేశం జనసేన బిజెపి పొత్తులు కుదిరిన తర్వాత కడప జిల్లాలో బద్వేలు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాలు బిజెపికి కేటాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. దాదాపు పది రోజుల పాటు బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ప్రచారం చేయలేదు. నాయకులు కార్యకర్తలు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత బొజ్జ రోశయ్య బిజెపిలో చేరడం వెంటనే పార్టీ అభ్యర్థిగా ఆయననే ప్రకటించడం చకచక జరిగిపోయాయి అలాగే జమ్మలమడుగు టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డిని కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అధిష్టానం రెండు రోజుల క్రితం ప్రకటించింది. శనివారం ప్రొద్దుటూరులో జరిగిన ప్రజాగళం
బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూపేష్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేయడంతో పాటు బుల్లెట్ లాంటి భూపేష్ రెడ్డిని గెలిపించుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా శనివారం రాత్రి బద్వేల్ లో జరిగిన మూడు పార్టీల ఆత్మీయ సమావేశంలో భూపేష్ రెడ్డి బొజ్జ రోశయ్య పాల్గొని ఓట్లు అభ్యర్థించారు ఈ సమావేశానికి మూడు పార్టీల జిల్లా నాయకులు హాజరయ్యారు సమావేశానికి భారీగానే స్పందన వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *