సిరాన్యూస్, చిగురుమామిడి
రైతులు మద్దతు ధర పొందాలి
* ఏపీఎం మట్టెల సంపత్
వరి ధాన్యాన్ని రైతులు ఆరబెట్టి తాలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని ఏపీఎం మట్టిల సంపత్ రైతులను కోరారు. సోమవారం మండల కేంద్రంలో టి సెల్ఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ క్వింటాలుకు 2203 రూపాయలు, కామన్ గ్రేడ్లు 2183 రూపాయలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ ఐ శైలజ, పోలోజు చైతన్య , వెంకట నారాయణ, వెంకట మల్లయ్య, కమిటీ సభ్యులు, రైతులు హమాలీలు పాల్గొన్నారు.