విజయవాడ నుండి హైదరాబాద్,బహదూర్ పూర్ కు తరలింపు
సుమారు 80 నుండి 90 వరకు గోవుల పట్టివేత
సిరా న్యూస్,షాద్ నగర్;
అక్రమంగా పొరుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్,బహదూర్ పూరకు తరలిస్తున్న గోవులను ఆదివారం రాత్రి ఆర్య సమాజ్ తెలంగాణ అధ్యక్షులు దీఫక్ సింగ్,యువకులు పట్టుకుని రక్షించారు.తెలిపిన సమాచారం ప్రకారం… ప్రతి రోజు రాత్రి పూట విజయవాడ నుండి హైదరాబాద్,బహదూర్ పూర వరకు గోవులను తరలించడం జరుగుతుందని అన్నారు.ఈ క్రమంలో కొత్తూరు ప్రాంతంలో తెలిసిన వ్యక్తులు ఉండడంతో గోవులను గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.గోవులను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాల కోసం విచారిస్తున్నామన్నారు.