సిరా న్యూస్,గుంటూరు;
పాత గుంటూరు పోలీసులు కథనం మేరకు నంది వెలుగు రోడ్ లోని క్రిస్టియన్ పేట లో నివాసముండే తవణం మొజేష్ (29) అతని తల్లి కవి బాబు ప్లంబర్ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు నిత్యం మద్యం సేవించి ఘర్షణ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో అదే విధంగా ఆదివారం అర్ధరాత్రి కూడా వివాదానికి దిగారు వివాదం నేపథ్యంలో ఆగ్రహించిన కవి బాబు పక్కనే ఉన్న మంచం కోడు తీసుకుని కుమారుడు మోజేష్ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
=======