సిరా న్యూస్,కమాన్ పూర్;
జమాఅతే ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు మేరాజ్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక జమాతే ఇస్లామీ హింద్ రామగుండం కార్పొరేషన్ 8 ఇంక్లైన్ కాలనీ ఆఫీసులో ఇఫ్తార్ పార్టీ నిర్వహించటం జరిగింది. వివిధ మతాలకు చెందిన వారు ఒక చోట చేరి స్నేహ పూర్వక వాతావరణంలో ఒకరి ధర్మం గురించి మరొకరు తెలుసుకోవడం ఇలాంటి సభల ఉద్దేశ్యం, రంజాన్ మాసంలో మానవుల సంస్కరణకె దైవం దివ్యఖురాను అవతరింపజేశాడు. అందుకే ఈ నెలకింత ప్రాధాన్యత మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జీవితంలోని అన్ని రంగాలలో ఏ విధంగా ఉండాలో ఈ గ్రంథంలో తెలుపబడింది. ఉపవాసాల ముఖ్య ఉద్దేశం ధైవప్రసన్నత. బంధు మిత్రులు సమాజంలోని బీద సాదల హక్కులను నెరవేరుస్తూ, అన్ని రకాల చెడుల నుంచి ఆగుతూ మంచి పనులు చేస్తూ దైవారాధన చేస్తే దైవ ప్రసన్నత లభిస్తుంది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్ సిఎన్ సి, మహమ్మద్ ఇస్మాయిల్, వక్తలు ప్రసగించటం జరిగింది. ఈ ఇఫ్తార పార్టీలో ముఖ్యఅతిథులుగా కృష్ణా రెడ్డి –
జక్కుల దామోదర్ రావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ,సిరాజుద్దీన్ కన్వీనర్ గా వ్యవహరించారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జావిద్ అక్మల్ హుస్సేనీ ఖురాన్ పారాయణం తో ఇఫ్తార్ పార్టీ-ప్రారంభించారు – ప్రోగ్రామ్ లో అక్రముద్దీన్, మునవ్వరుద్దీన్, ఫహీమ్, ఖాజా మొయినుద్దీన్, ముహమ్మద్ ముజాహిద్.అహ్మద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.
=======