సిరా న్యూస్,విజయవాడ;
పెన్షన్ పంపిణీ విషయం లో వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత పట్టాభి విరుచుకపడ్డారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ నిలిపేయాలని హై కోర్టు గాని, ఎలక్షన్ కమిషన్ గాని ఆదేశించలేదు. ఈ నెల పెన్షన్ల పంపిణికి 1950 కోట్ల అవసరం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఎన్ డి ఏ కూటమి పై నిందలు మోపుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యధావిధిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాసారు. పెన్షన్ ల పంపిణీ చేత కాకపోతే 1950 కోట్లు ఇక్కడ పెట్టి, ఒక్క రోజు సీఎం గా తప్పుకో. మీ సచివాలయం సిబ్బంది, మీ ఉద్యోగులను వాడుకొని ఒక్క రోజులో పెన్షన్ పంపిణీ చేసి చూపిస్తామని అన్నారు.