టాటానగర్ లో అగ్ని ప్రమాదం

సిరా న్యూస్,రంగారెడ్డి;
మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ లోని పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పరుపులు అగ్నికి ఆహుతయ్యాయి దట్టమైన నల్లని పొగ వ్యాపించడంతో
ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లతో ప్రయత్నం చేసారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు ఇటువైపు వస్తారు. సంబంధిత అధికారులుచూసి చూడనట్లుగా ఉండడంతో ఇలాంటి అక్రమ కంపెనీలు అడుగు అడుగున పట్టాగోడుగులుగా జనవాసాల మధ్యలో వేలు స్తున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వీటివల్ల ప్రజలు తివ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భానుడి ప్రతాపానికి తాళలేక ప్రతిరోజు ఏదో ఒకచోట అగ్ని ప్రమాదం జరుగుతుంది. కంపెనీ ఏర్పాటు చేసేటప్పుడు సెక్యూరిటీ ఉంటేనే అనుమతులు ఇవ్వాలి కానీ కాటేదాన్ గగన్ పాడు శాతం రాయి పారిశ్రామిక వాడల్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇలాంటి నిబంధనలను పాటించడంలేదు. అధికారుల డొల్లతనం వల్లనే ఇలాంటి అక్రమాలు ప్రతిరోజు ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. విటివల్ల స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు కన్నెత్తి ఇటువైపు చూడాలంటూ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *