ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి

స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి.
ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్.
పద్మశాలీలకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వాటా కల్పించాలి. వనం దుశ్శాంతల.
పద్మశాలీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి ..బొమ్మ ప్రవల్లిక.
సిరా న్యూస్,మేడ్చల్ ;
;ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళాలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు . మహిళలు పురుషులతో సమానమని స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని ప్రముఖ సంఘ సేవకురాలు ఈటెల జమున రాజేందర్ పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు బొమ్మ ప్రవల్లిక ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని సువర్ణ కళ్యాణ వేదికలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రముఖ సంఘ సేవకురాలు జమున రాజేందర్లు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు వనం దుశ్శాంతల జాతీయరాజకీయ అధ్యక్షులు బోల్ల శివశంకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా పద్మశాలి కుల దైవం మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ* ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళా శక్తి మణులు దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. పద్మశాలి కుల బంధువులతో తనకు ఆత్మీయమైన అనుబంధం ఉందని పద్మశాలీల సంక్షేమానికి గతంలో కృషి చేశానని మళ్లీ ఎంపీగా గెలిస్తే పద్మశాలీల ప్రతి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు.ఈ సందర్భంగా సిరి రాంకుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది మ్యూజికల్ చైర్స్ త్రో బాల్ కుషన్ గేమ్ పిరమిడ్ పలు ఆట పోటీలను నిర్వహించారు ఈ ఆట పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహవంతంగా నృత్యాలు చేస్తూ. కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహభరితంగా ఆట పోటీలలో పాల్గొన్నారు అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు వనం దుశ్శoతల, వర్ణ లీలల ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో, కోశాధికారి మిరియాల విశ్వ రేఖ, ఉపాధ్యక్షులు బండారు లక్ష్మి, పోట్టపత్తిని అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ పద్మ దమ్మయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ గోగుల సరిత,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మచ్చ వరలక్ష్మి,ఏ బ్లాక్ అధ్యక్షురాలు బద్దినేని అనంత లక్ష్మి నాగారం కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి ,దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాసరెడ్డి,, యూత్ అధ్యక్షులు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరిగంటి వెంకటేష్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోమేష్, తదితరులు పాల్గొన్నారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *