సిరాన్యూస్, ఓదెల
ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయండి
* తెలంగాణ ఉద్యమకారుడు గుండేటి ఐలయ్య
* మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఉద్యమకారులు
ఉద్యమకారుల సంక్షేమానికి కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు గుండేటి ఐలయ్య అన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో సోమవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండేటి ఐలయ్య, పెద్దపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులుదుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 250 గల ఇళ్లస్థలం, ప్రతి జూన్ 2 తారీకున ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమంతో పాటు బస్సు పాస్, ట్రైన్ పాస్ ఉద్యమకారులకు హెల్త్ కార్డ్స్ పెన్షన్ తో పాటు కేసులు ఉన్నవాళ్లే కాకుండా ఉద్యమంలో క్రియాశీలక పాత్రలో పోషించిన అందరికీ కూడా తగిన ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. గత శాసనసభ ఎన్నికలలో కూడా ఉద్యమకారుల అందరము అండగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. ఉద్యమకారులను అందరము అదే రీతిలో కలిసికట్టుగా పనిచేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగడ్డం వంశీకృష్ణ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీకి విశ్వాస పాత్రునిల ఉంటామని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ బత్తుల శంకర్ , పెద్దపెల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు దెబ్బట చంద్రకళ , పెద్దపెల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ మాధవరపు ఆంజనేయరావు , జిల్లా నాయకులు సాతూరి రాజేశం , పెంచాల మల్లయ్య , అమ్ముల మల్లయ్య , ముద్దమల్ల రమేష్ , కాంతల సమ్మిరెడ్డి ,చింతకుంట వెంకటరెడ్డి , తొట్ల రాములు ,మాచర్ల రవి గౌడ్ , జూపాక ఐలయ్య గౌడ్ , జూన్వాల తిరుపతి , రౌతు సందీప్ , మాడ నారాయణరెడ్డి నూనె రాజేశం, గోగుల రాజిరెడ్డి ,చంటి, నరసమ్మ ఎండి ఖతీజ సంటి పద్మ, పెరకసుమ వడ్లూరి హరిత, మిట్టపల్లి దుర్గమ్మ, ఘన వేణి, రాజేశ్వరి రమాదేవి, కొండ్ర తదితరులు పాల్గొన్నారు.