సిరాన్యూస్, బేల
అట్టహాసంగా ఆలయ భూమి పూజ
* హాజరైన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి పెనుగంగా నది తీరాన రూ.2 కోట్లతో నిర్మించ తలపెట్టిన సుందర శివాలయ ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ అట్టహాసంగా జరిగింది.. గ్రామంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో ఈ మహా కార్య నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెల్లవారుజామున 6 గంటలకు కొత్త సాంగిడి హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది.ప్రారంభమై పాత ఆయా గ్రామాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా మంగళహారతులు డప్పు వాయిద్యాలతో పాత సాంగిడిలోని సంత్ మోతీజి మహారాజ్ మందిర్ మీదుగా గ్రామంలోని పుర వీధుల గుండా శివాలయ నిర్మాణ స్థలo వరకు శోభా యాత్ర కొనసాగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా శివాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐదుగురు ఉద్యోగ ఉద్యోగుల జంటలు ప్రత్యేక పూజలు హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీమంత్రి జోగు రామన్న, బీజేపీ నాయకురాలు చిట్యాల సువాసిని రెడ్డి వేరువేరుగా హాజరై ఆలయ నిర్మాణానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు చిప్ప రమేష్, సిద్రప్ అశోక్, సభ్యులు పాల్గొన్నారు.