సిరా న్యూస్,కోరుట్ల;
పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం త్రిశక్తి మాత ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివ సారధ్యంలో సామూహిక చండీ హోమం నిర్వహించారు..దీనిలో సుమారు 150 జంటలు పాల్గొన్నాయి..
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ కోరిన కోరికలు నెరవేర్చాలని ప్రార్థించారు..
అనంతరం అధ్యక్షులు కటుకం గణేష్ మాట్లాడుతూ కార్తీక మాసం శుక్రవారం త్రిశక్తి మాత ఆలయంలో పంటలు సమృద్ధిగా పండి ప్రజలు పిల్లాపాపలతో సుఖంగా జీవించాలని కోరుతూ ఈ చండీ హోమం నిర్వహించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో గణేష్ నవదుర్గ మండలి అధ్యక్షులు కటుకం గణేష్ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి శంకర్ కోశాధికారి ఆడువాల ప్రభాకర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు