సిరా న్యూస్,తిరుపతి;
మోక్ష సాధనకు పాంచరాత్ర ఆగమము పాటించడమే సరైన మార్గమని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాస చార్యులు అన్నారు.
: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో డిసెంబర్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు అఖిల భారతీయ భగవచ్చాస్త్ర శ్రీ పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం కార్యక్రమం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్,టి.టి.డి భగవచ్చాస్త్ర శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ , శ్రీరంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మొదటిరోజు భగవచ్చాస్త్ర ఆవిర్భావం, ఆగమ నిగమ విశ్లేషణ, ఉపనిషత్తులు, మహోపనిషత్తులు గురించి చర్చించారు ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీమద్ రామానుజ చార్యులు ఆమోదించబడిన శాస్త్రమే పాంచరాత్ర ఆగమని అన్నారు. లక్ష్మీదేవికి శేషుడికి గరుత్మంతునికి విశ్వక్సేనునికి బ్రహ్మదేవునికి ఐదు రాత్రులు ఉపదేశించబడిన శాస్త్రం కనుక దీనిని పాంచరాత్ర శాస్త్రం అంటారని వివరించారు. మోక్ష సాధనకు పాంచరాత్ర శాస్త్రమే సరైన మార్గమని పేర్కొన్నారు.