సిరా న్యూస్,హైదరాబాద్;
డిసెంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. ఉదయం 10 గంటల సమయంలో తొలి ఫలితం రావొచ్చు. ఇందుకోసం 49 కేంద్రాలు అందుబాటులో ఉంచాం. శుక్రవారం,శనివారం కౌంటింగ్ పై అధికారులతో సమీక్షలు చేస్తాం’ అని వెల్లడించారు.