సిరా న్యూస్,తుగ్గలి;
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన వైఎస్సార్ జలకళ పథకం రైతులకు గొప్ప వరమని ఎమ్మెల్యే శ్రీదేవి తెలియజేశారు. శుక్రవారం రోజున మండల పరిధిలోని గల శభాష్ పురం గ్రామం నందు రైతు సుంకన్న పొలంలో వైయస్సార్ జలకళ బోరు ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శభాష్ పురం గ్రామపంచాయతీ నందు 103 మంది రైతులకు ఉచితంగా వైయస్సార్ జలకల ద్వారా బోర్లను వేయించినట్లు ఆమె తెలియజేశారు. అదేవిధంగా 35 మంది రైతులకు ఉచితంగా విద్యుత్ మోటార్లను పంపిణీ చేశారు.రైతుల సంక్షేమం కొరకు వైసిపి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆమె తెలియజేశారు.తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా తప్పకుండా ప్రకటిస్తామని ఆమె సభాముఖంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడి పద్మావతి,ఏపీఓ రామకృష్ణ,ఏఈ మహేశ్వర్ రెడ్డి, ఈసీ ప్రదీప్,సచివాలయాల మండల కన్వీనర్ హనుమంతు,గౌరవ సలహాదారులు రవి,ఫీల్డ్ అసిస్టెంట్ సందీప్,ఉపాధి సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు