పూతలపట్టు నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్
సిరా న్యూస్,పూతలపట్టు;
ప్రతినెల ఒకటో తారీఖున అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం అడ్డు కాదన్నారు, వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పెన్షన్ల కార్యక్రమం ఈనాటిది కాదు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 200 నుంచి 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు దే అన్నారు, రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే 4000 వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని ఆయన తెలిపారు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగస్తులు మరియు అనుబంధ ఉద్యోగస్తులు ద్వారా అవ్వ తాతలకు పెన్షన్లు అందించే కార్యక్రమం త్వరగా చేపట్టాలని ఆయన తెలియజేశారు. కట్టు కథలు పిట్టకథలతో ప్రజలను ఏ మార్చలేరు, వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.