సిరాన్యూస్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా
ఈనెల 4న నిర్వహించాల్సిన ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేసినట్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించచున్నందున సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. తదుపరి సమావేశ నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.