ఒలంపియాడ్ లో నోబెల్ విద్యార్థుల ప్రతిభ

సిరా న్యూస్,పెద్దపల్లి;
హైద్రాబాద్ ఈ-అభ్యాస్ ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సాట్ సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలో పెద్దకల్వల నోబెల్ పాఠశాల విధ్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు పాఠశాల కరెస్పాండెంట్ ఎర్రోజు మోహన్ రాజ వివరాలు వెళ్ళడించారు. 6వ తరగతి చదువుతున్న శ్రీరామోజు అక్షయ, 7వ తరగతి విద్యార్థిని కారుపాకల సమీక్ష, 8వ తరగతి విధ్యార్థిని అడిచర్ల అష్మిత, 9వ తరగతి విధ్యార్థిని పయ్యావుల రష్మిత సైన్స్ ఒలంపియాడ్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి విజేతలుగా నిలిచారని తెలిపారు. విజేతలకు హైద్రాబాదులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో బహుమతులు అందుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రణీత, కో ఆర్డినేటరు బెజ్జంకి రాధిక, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *