మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ క్రాంతి ని సన్మానించిన ముదిరాజ్ సంఘం

సిరా న్యూస్,మంథని;

ఇటీవల జరిగిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా ఎన్నికల్లో జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోతరవేని క్రాంతి కుమార్ ని మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేట్ కు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ మాట్లాడుతూ మత్స్య కార్మికుల సమస్యల పరిష్కారాలకు మత్స్య శాఖ సహకార సంఘాల అభివృద్ధి కి ఎల్లవేళలా నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
అలాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి యేడాది చాలా ఆలస్యంగా నాసిరకం చేప పిల్లల పంపిణీ చేసేది అందువల్ల జూలై లో వేయాల్సిన చేప పిల్లలు అక్టోబర్ నవంబర్ లో చెరువులో వేయడం వలన చేప పిల్లల ఎదుగుదల లేక మత్స్య కారులు చాలా నష్టపోయేవారు అందువలన ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్య కారుల గురించి అలోచించి తగిన సమయంలో నగదు రూపేణ అందిస్తే మత్స్యకారులకు ఉపయోగదాయకంగా ఉంటుంది అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పోతరవేని లక్ష్మిరాజం, సబ్బని సమ్మయ్య, పోలు శివ, పోలు కనక రాజు,కుంట బద్రి, గుండా రాజు,బొజ్జ శ్రీను,బయ్య లింగయ్య, సబ్బని శంకర్, ముదిరాజ్ కులస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *