వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో కలకలం
సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరులో మంగళ వారం తెల్లవారుజామున పాడుబడిన ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడటంతో తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి అరుపులు విన్న స్థానికులు భయంతో ఇళ్లల్లోకి పరుగులు పెట్టి తలుపులు వేసుకున్నారు. ఎలుగుబంటి స్వైరవిహారంపై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఏ మురళీకృష్ణ నాయుడు తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న ఎలుగుబంటిని బంధించి విశాఖ జూకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు