రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర పై సకాలంలో కొనుగోలు చేయాలి

-అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్

-మంథని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

సిరా న్యూస్,మంథని;

జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర పై సకాలంలో కొనుగోలు చేయాలని పెద్దపెల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మంథని మండలంలో పర్యటించి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ యాసంగి 2023-24 సీజన్ కు సంబంధించి మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు జరిగిందని ఆయన తెలిపారు. రైతులు తమ పంటకు మద్దతు ధర సాధించడానికి నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ధాన్యాన్ని బాగా ఆరబెట్టి చెత్త, తాలు, మట్టి పెడలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పంట తీసుకొని రావాలని అదనపు కలెక్టర్ కోరారు.
ధాన్యం విక్రయించే సమయంలో రైతులు తమ ఫోన్ నెంబర్ ను ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి తీసుకుని రావాలని, ధాన్యం విక్రయించే సమయంలో ఓటిపి కోసం సెల్ ఫోన్ తీసుకుని రావాలని , ఆధార్ కార్డు , పట్టాదార్ పాస్ పుస్తకం బ్యాంక్ ఖాతా పుస్తకం తమ వెంట తీసుకుని రావాలని అన్నారు.
కోనుగోలు కేంద్రంలో అవసరమైన మౌళిక వసతులను సరి చూసుకొని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొని, సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ మంథని ఎం.ఎల్.ఎస్ పాయింట్ ను సందర్శించి, రేషన్ షాపులకు పంపిణీ చేయాల్సిన రైస్ నిలువలు,వాటి రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని, గోదాం నిర్వహణకు సంబంధించి మరమ్మత్తులు, జాగ్రత్తలు ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఎమ్.శ్రీకాంత్, జిల్లా సహకార అధికారి శ్రీ మాల, వ్యవసాయ, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *