సర్వాయి పాపన్న మహారాజ్ 314 వర్ధంతి

సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా సమీపంలో సర్వాయి పాపన్న 314 వర్ధంతిని (ఆత్మ బలిదాన దినోత్సవం )ఘనంగా నిర్వహించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య గౌడ్ ,ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు,గౌడ సంఘం సంఘం నాయకులు కారింగుల అంజన్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాపన్న చిత్రపటానికి పూల దండ వేసి నివాళులర్పించారు.సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతినీ పురస్కరించుకొని
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. 300 సంవత్సరాలకంటే ముందే బహుజన రాజ్యం కొరకు గోల్కొండ కోటను అధిరోహించి గోల్కొండ సింహసనాన్ని వశపరుచుకున్న బడుగు, బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గుర్తు చేసారు. పాపన్న గౌడ్ ఒక గౌడ కులానికే కాకుండా బీసీ సామాజిక వర్గానికి అన్ని కులాలకు సహకరించిన ధీరుడని, పెత్తందారులను ఎదురించి పెద ప్రజలకు అండగా నిలిచి ఆదుకున్నరని గుర్తు చేసారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ఆయన సిద్ధాంతాలను ఈ తరం ,వచ్చే తరం వారు కూడా ఆచరించి ,అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలను గౌడ కులస్తులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ పేరు మీదుగా రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు పేరు పెట్టాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదురుగా ఉన్న నేషనల్ హైవే ప్రాంగణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *