-భజన, అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణంలోని తమ్మి చేరు కట్ట వీధిలో గల శ్రీ బిక్షేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం ఎక్కహం కార్యక్రమం ఘనంగా ముగిసింది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎక్కహం ( భజన ) కార్యక్రమం మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ముగిసింది. 24 గంటల పాటు నిరవధికంగా జరిగిన ఈ భజన కార్యక్రమంలో మంథని పట్టణంలోని అన్ని వాడలకు చెందిన భక్తులు పాలీల వారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే పశ్చిమ ముఖ ద్వారం కలిగిన ఏకైక దేవాలయం మంథనిలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. మంథనిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయంలో ప్రతినిత్యం వందలాది మంది భక్తులు అభిషేకం చేయించుకుంటున్నడం విశేషం. మంగళవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశేశంగా భక్తులు పాల్గొన్నారు. పాల్గున మాసంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శ్రేయస్కారమని కార్యక్రమ నిర్వాహకులు కొత్త శ్రీనివాస్, ఒల్లాల విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని శివలింగాన్ని ఆలయ పూజారి పల్లి సంజీవ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు మహావాది శివలు అందంగా అలంకరించారు.