ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
వైసీపీలో చేరిన తెదేపా నాయకులు
సిరా న్యూస్,నందికొట్కూరు;
పెన్షన్లు ఇంటి వద్దకే అందించే వాలంటరీ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పారుమంచాల వైసీపీ సీనియర్ నాయకులు పోచ స్వామి రెడ్డి జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి, పోచ హేమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమక్షంలో టిడిపి పార్టీని వీడి వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతరం వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధికి ఆకర్షితులై వైసిపి లో చేరుతున్న తెలిపారు. ఈ సందర్భంగా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కులమత పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైఎస్ జగన్ కి దక్కింది అన్నారు .పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు . తెలుగుదేశం పార్టీకి చెందిన చాకలి వెంకట రమణ, గుండెపోగు ఇమ్మానుయేలు, తిమ్మాపురం భాష, మాధవరం రాయప్ప, మాధవరం ప్రసాద్ మాధవరం మరియదాస్ , శేషన్న మాధవరం పుల్లయ్య , మాధవరం జానయ్య , మాధవరం గురుస్వామి ,మాధవరం పవన్ ,మాధవరం మునిస్వామి, సామెల్ , రమేష్ , సురేష్ , విన్న రాముడు, చిట్టెన్న , రంగన్న , మధు , బరత్ , చిన్ని , వీరాపురం వెంకటేశ్వర్లు తదితరులు వైసీపీ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో చల్లా శేఖర్ రెడ్డి, కేశవరెడ్డి భరత్ రెడ్డి, మాజీ సర్పంచ్ విజయకుమార్, మహేష్ నాయుడు, తలారి శివుడు, నాగరత్నం, స్వామి దాసు, జాకీర్, ఖాజా తదితరులు పాల్గొన్నారు