సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే మార్నింగ్ వాక్
* కరువు నివారణకు ప్రభుత్వం చర్యలు
* రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
* ఐకెపి సెంటర్ ను పునరుద్ధరించాలని వినతిపత్రం
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఉదయం పూట మార్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో ప్రజలతో వ్యాపారులు, విద్యార్థులతో కలిసి మాట్లాడారు.వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారం కోసం వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గ తెలంగాణ ప్రజలు ఏ సమస్యలున్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.రాష్ట్రంలో కరువు ఉన్నది వాస్తవమేనని, కరువు నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టమైన చర్యలు చేపట్టిందని తెలిపారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎన్ని నిధులు వెచ్చించైనా గ్రామాల్లో తాగునీటి కోసం బోర్లు వేయించి ప్రజలకు నీరు అందించేలాగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.ఇప్పటికే ఆరు గ్యారెంటీలో భాగంగా ఉచిత కరెంటు, 500 కే గ్యాస్ కనెక్షన్, ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం వంటి పథకాల అమలు చేస్తున్నట్లు తెలిపారు.మిగిలిన అన్ని హామీలు అమలుకు ప్రభుత్వం కృషిస్తుందని అన్నారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి నీ తొందరగా ప్రకటించాలని పార్టీ అధినాయకత్వానికి విన్నవిస్తామని తెలిపారు.కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని గెలిపించే దిశగా పనిచేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో దున్నపోతుల రాజయ్య తమ భూ సమస్య పరిష్కరించాలని మంత్రి కి వినతి పత్రం అందించారు. గడిపే స్వామి ఇలా ఇంటి వద్ద హ్యాండ్ పంపుకు బోరు మోటర్ బిగించి మినీ వాటర్ ట్యాంక్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. బొమ్మనపల్లి కాంగ్రెస్ నాయకులు గ్రామంలోని ఐకెపి సెంటర్ ను పునరుద్ధరించి పూర్తి చేయాలని వినతిపత్రం అందించారు.