– ఎంపిడివో శ్రీనివాస్ గౌడ్
సిరా న్యూస్,పెద్దపల్లి;
కూలీలు గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడివో గున్నాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మండలం లోని అందుగులపల్లి గ్రామంలో నడుస్తున్న ఉపాధి హామీ పనులను ఎంపిటిసి పందిళ్ళ లక్ష్మణ్, ఎంపిడివో లు పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాది హామీ పనుల వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగు నీరు ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లు పంపిణి చేసారు. వారి వెంట ఏపీవో రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి కిషోర్, టి ఎ దివ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.
=============