గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లా కేంద్రంలోని గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 5 న ఉదయం 9:30 గంటలకు క్యాంపస్ డ్రైవ్ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలియజేశారు. ప్రముఖ కంపెనీలు విప్రో, ఐడిబిఐ బ్యాంక్, జీకే సాఫ్ట్ సొల్యూషన్స్, టీం లీజ్ డిజిటల్ మరియు యన్నిక్ టెక్ కంపెనీలు పాల్గొనడం జరుగుతుందని గాయత్రి డిగ్రీ & పీజీ కళాశాలలో చదివే తృతీయ సంవత్సరం బిఎస్సి, బీకాం విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరని కోరారు. మరిన్ని వివరాలకు గాయత్రి డిగ్రీ, పి.జి.కళాశాల, సెల్ నంబర్ 83095 94634, 95331 66174 సంప్రదిరించగలరని ఆయన పేర్కొన్నారు.