సిరా న్యూస్, ఆదిలాబాద్
ఎస్ఆర్ డీజీ స్కూల్ లో కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే సంబరాలు
* విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేత
ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ డీజీ స్కూల్ లో 2023 -2024 విద్యాసంవత్సరం ముగింపు పురస్కరించుకొని బుధవారం కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం యూకేజీ విద్యార్థిని విద్యార్థులకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఈ విధంగా గ్రాడ్యుయేషన్ డే చేయడం విద్యార్థుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరిక పెరుగుతుందని, వారు ఇంకా రెట్టించిన ఉత్సహంతో చదువుతారని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ ఇంచార్జి పి. శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ సి.హెచ్ క్రాంతి కుమార్ , వైస్ ప్రిన్సిపాల్ సంతోష్, ప్రీప్రైమరీ ఇంచార్జి లక్ష్మి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు , తల్లితండ్రులు పాల్గొన్నారు.