ప్రపంచంలోని మొట్టమొదటి భారతీయ తయారీ డ్రింక్స్
సిరా న్యూస్,హైదరాబాద్;
దేశీయంగా ఉత్పత్తి చేసిన బయో-క్లబ్ డ్రింక్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్థ అధికారికంగా హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో బయో డ్రింక్స్ ఆవిష్కర్త డాక్టర్ శ్రీనివాస్ అమర్నాథ్ మాట్లాడారు. తమ ఉత్పత్తులు “బయో డ్రింక్స్, సింథటిక్ రుచులు, రంగులు లేని సహజ సుగంధాలతో నిండి ఉంటాయని, అంతేకాకుండా సాంప్రదాయ మద్యం ఉత్పత్తులతో పోలిస్తే మత్తు ప్రభావాలను అందిస్తాయన్నారు. ఆయుర్వేదంలో మూడు దశాబ్దాల నైపుణ్యం నుండి వీటిని తీసుకొన్నామని, మొక్కల ఆధారిత నానోటెక్నాలజీ ద్వారా బయో డ్రింక్స్ కి అభివృద్ధికి కృషి చేశామన్నారు. అలోవెరా, ఆర్టిచోక్, రతనీ రూట్, లికోరైస్ తదితర అరుదైన బొటానికల్స్ వంటి పదార్థాలను ఉపయోగించి బయో లిక్కర్లు రూపొందించబడ్డాయన్నారు. నేటి నుండి బయో ఇండియా ఈ అరుదైన బొటానికల్స్ కలిపిన విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కాను పరిచయం చేస్తుందన్నారు.
============