సిరా న్యూస్,కడప;
పింఛన్ పంపిణీనూ వివాదం కొనసాగుతునే వుంది. బుధవారం నుంచి సచివాలయాల దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషమం తెలిసిందే. పింఛన్ కోసం ఉదయం నుంచి సచివాలయాల దగ్గర వృద్ధులు, వికలాంగులు ఎదురు చూస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు పింఛన్ల పంపిణీ మొదలు కాలేదు. పెన్షన్ల విషయంలో ప్రధాన పార్టీలు ఒకదానిపై ఒకటి రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్లే పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతాయని వైసిపి వర్గాలు అంటున్నాయి. ఖజానాలో డబ్బులు లేక అధికారులు ఆలస్యం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.