ఎంపీ మార్గాని భరత్ రామ్
సిరా న్యూస్,రాజమండ్రి;
గతంలో పెన్షన్ల కోసం క్యూ లైన్ లో నిలబడి ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. ఇప్పుడు ఎండ దెబ్బకు వడగాలులకు ఎవరైనా చనిపోతే దాని బాధ్యత చంద్రబాబుదే నని ఎంపి మార్గాని భరత్ అన్నారు. ఖజానాలో డబ్బులు లేవు అన్న మాట వాస్తవం కాదు. పెన్షన్ దారుల గురించి వాలంటీర్లకు తెలిసినంతగా ఏ ఉద్యోగికి తెలియదు. పెన్షన్ దారులు ఇబ్బంది పడటానికి కారణం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 66 లక్షల 70 వేల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. వాలంటీర్లు లేకుండా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఎలా ఇవ్వగలం. చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే రెండు మూడు రోజులు పట్టేది. దుర్మార్గులు చేసిన కార్యక్రమానికి పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే భవిష్యత్తులో పెన్షన్లు ఉండవు. వాలంటీర్లు నిస్వార్థంతో సేవలు అందిస్తూ వచ్చారని అన్నారు.