సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ కనకదుర్గ అలయంలో ఛైత్ర మాస బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను ఆలయ అధికారులు విడుదల చేసారు. దుర్గగుడి ఈఓ రామారావు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై 9 వ తేదీ నుండి క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవములు జరుగుతాయి. 9 నుండి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నాం. ఉగాది రోజు 3 గంటలకు పంచగ శ్రవణం జరుగుతుంది.. తంగిరాల ప్రభాకర్ సిద్ధాంతి పంచగా శ్రవనన్ని చెప్తారు. సాయంత్రం 6 గంటలకు వెండి రథం నగర ఉత్సవం కు వెళ్తుంది. ఉగాది రోజు ఆర్జిత సేవలు కొన్ని నిలిపేస్తం. ఉగాది రోజు 8 గంటల నుండి దుర్గమ్మ దర్శనాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తాం. వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పుష్పార్చన సేవలు వుంటాయని అన్నారు. . వసంత నవరాత్రి ఉత్సవాలలో దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు పుష్పాలు సమర్పించాలనుకునే వారు ఒక రోజు ముందుగా తెలియజేయాలని విజ్ఞప్తి చేసారు.