సిరా న్యూస్, ఆదిలాబాద్
మూగ జీవాలకు నీటి తొట్టెలను ప్రారంభించిన కంది శ్రీనివాస రెడ్డి
* బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ని అభినందించిన కెఎస్ ఆర్
సామాజిక సేవలో యువత ముందుండాలని, వారికి అన్నివిధాలుగా తన సహాయ సహకారాలు అందిస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మసూద్చౌక్లో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ఫ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మూజగీవాల కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను ఆకలి తీర్చేందుకు పశుగ్రాస కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కంది శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మండు వేసవిలో ఆకలి దప్పికలకు తపించిపోతున్న మూగ జీవాల పట్ల చూపిస్తున్న ఔదార్యాన్నిఆయన అభినందించారు. సొసైటీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజిజ్ పుట్టినరోజును పురష్కరించుకొని ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగానే గొప్ప విషయమన్నారు. ప్రతిఒక్కరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కంది శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కొనసాగించాలని సంస్థ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండీ ముజాయిద్, సొసైటీ ముఖ్య సలహాదారులు సాబీర్ హుస్సేన్, ఆసిఫ్, మోహిన్, షకీల్, కలీం, ఇర్షాద్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కయ్యుమ్, రఫిక్, గంగారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాయిన్ వార్ గంగా రెడ్డి,నాగర్కర్ శంకర్, బండి దేవిదాస్ చారి, ఎం. ఏ షకీల్, కయ్యుమ్, కోరెడ్డి కిషన్, డేరా కృష్ణ రెడ్డి, పత్తి ముజ్జు, రఫీక్ ఎల్మ రామ్ రెడ్డి, అఖిల్, శ్రీ రామ్ తదితరులు పాల్గొన్నారు