సిరా న్యూస్, చిగురుమామిడి:
కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తె మట్టెల పంపిణీ..
కరీంనగర్ డెయిరీలో అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో పుస్తె మట్టెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం బొమ్మనపల్లి డైరీ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య ఆధ్వర్యంలో పాడి రైతు మాచమల్ల నర్సింగ్ కుమార్తె స్వరూప కీ పుస్తె మట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంది శంకర్, దరిపెల్లి శ్రీనివాస్, పోతుల పోచయ్య, కరీంనగర్ డైరీ సూపర్వైజర్ రవి, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.